Paris: పారిస్‌లో ఉగ్రదాడి.. చేతిలో కత్తితో ‘అల్లాహు అక్బర్’ అంటూ బీభత్సం

  • గత మూడేళ్లుగా పారిస్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న ఐసిస్
  • రద్దీ ప్రాంతంలో కత్తితో బీభత్సం సృష్టించిన ఉగ్రవాది
  • ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు

పారిస్‌లో మరో ఉగ్రదాడి జరిగింది. కత్తి  పట్టుకున్న ఓ వ్యక్తి ‘అల్లాహు అక్బర్’ అని అరుస్తూ దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. సెంట్రల్ పారిస్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఉగ్రవాదిని కాల్చిచంపారు.

బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లతో నిండి ఉండే నగరంలోని ఒపేరా హౌస్ ప్రాంతంలో ఉగ్రవాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. జనాలు వీకెండ్ నైట్ ఉత్సాహంలో ఉండగా దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ఫ్రెంచ్ లో మరోమారు రక్తం చిందిందని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాది తమ సైనికుడేనని ఐసిస్ అధికారిక న్యూస్ ఏజెన్సీ అమాఖ్ తెలిపింది.

గత మూడేళ్లుగా ఉగ్రవాదులు పారిస్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నవంబరు 2015లో జరిగిన ఉగ్రదాడిలో 130 మంది ప్రాణాలు కోల్పోగా, 2016లో నీస్‌లో ఉగ్రవాదులు ట్రక్కుదాడికి పాల్పడ్డారు. తాజా ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

More Telugu News