cuddapah: కడపలో దారుణం.. బాలికపై ఇంటర్ విద్యార్థుల అత్యాచారం!

  • దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు విద్యార్థులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లిదండ్రులు
  • నిందితుల అరెస్ట్

దాచేపల్లి ఘటన మరువకముందే కడప జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇంటర్ మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలు.. బద్వేల్ మునిసిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీకి చెందిన ఓ బాలికపై ఇంటర్ మీడియట్ చదువుతున్న విద్యార్థులు రమేష్, కృష్ణ .. ముళ్లపొదల్లోకి ఆ బాలికను ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన అనంతరం జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు బాధితురాలు చెప్పింది. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలించి వారిని అరెస్టు చేశామని, అత్యాచారానికి గురైన బాలికను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

More Telugu News