Kodandaram: తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా కోదండరామ్‌.. పార్టీ జెండా ఆవిష్కరణ

  • సరూర్‌నగర్‌ మైదానంలో ఆవిర్భావ సభ
  • భారీగా తరలివచ్చిన ప్రజలు
  • సభకు హాజరైన ప్రొఫెసర్‌ హరగోపాల్

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ మైదానంలో తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభ కొనసాగుతోంది. ఈ సభలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా కోదండరామ్‌ను ఆ పార్టీ నేతలు అంబటి శ్రీనివాస్‌, భిక్షపతి ప్రతిపాదించగా, అనంతరం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికను నేతలు, కార్యకర్తలు ఆమోదించారు. ఈ సందర్భంగా తమ పార్టీ జెండాను కోదండరామ్ ఆవిష్కరించారు. ప్రజలు భారీగా తరలివచ్చిన ఈ సభలో ప్రొఫెసర్‌ హరగోపాల్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని టీఆర్‌ఎస్‌ సర్కారు తీరుని సభలో తెజస నేతలు ఎండగడుతున్నారు. కాగా, తెలంగాణ జన సమితికి 'తీన్మార్‌' మల్లన్న రూ.1,00,116 విరాళం ఇచ్చారు.        

  • Loading...

More Telugu News