rangasthalam movie: చెన్నైలో 'రంగస్థలం'కు ఇలా కలిసొచ్చింది!

  • నెలరోజులుగా విడుదల కాని తమిళ చిత్రాలు
  • కొత్త సినిమాలు లేక బోర్ ఫీలవుతున్న చెన్నైవాసులు
  • 'రంగస్థలం' థియేటర్లకు క్యూ కడుతున్న తెలుగు వారు 

భారీ అంచనాల మధ్య విడుదలైన రామ్ చరణ్ తాజా చిత్రం 'రంగస్థలం' పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ లో కూడా మంచి బిజినెస్ చేస్తోంది. మరోవైపు చెన్నైలో ఈ చిత్రానికి ఊహించని విధంగా ఓ అంశం కలిసి వచ్చింది. గత నెలరోజులుగా తమిళనాడులో కోలీవుడ్ చిత్రాలు విడుదల కావడం లేదు. కొన్ని కారణాల వల్ల అక్కడ బంద్ పాటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, కొత్త సినిమాలు లేక చెన్నైవాసులు బోర్ ఫీల్ అవుతున్నారు. ఈ తరుణంలో 'రంగస్థలం' విడుదల కావడం అక్కడ నివసిస్తున్న తెలుగువారికి ఉల్లాసాన్ని కలిగించింది. సినిమా చూడ్డానికి చెన్నైలోని తెలుగు తంబీలు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో, ఈ చిత్రం విడుదలైన థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి.

More Telugu News