Chandrababu: ఆ క్వార్టర్స్ అమరావతిలో ఉన్నాయా? భూగర్భంలో ఉన్నాయా? : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

  • ఎమ్మెల్యే, స్టాఫ్ క్వార్టర్స్ యూసీలు పంపామని బాబు చెప్పారు
  • ఆ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పాలి?
  • మోదీని కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలున్నాయి
  • ఏపీలో అవినీతిపై ప్రశ్నించడాన్ని దాడిగా అభివర్ణిస్తారా? 

అమరావతిలో నిర్మాణాలకు సంబంధించిన యూసీలను కేంద్రానికి పంపామని చెబుతున్న సీఎం చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నలు గుప్పించారు. ఎమ్మెల్యే, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.744 కోట్లు ఖర్చు చేశామని, అందుకు సంబంధించిన యూసీలను పంపామని చంద్రబాబు చెప్పారని అన్నారు. అయితే, ఆ క్వార్టర్ ఎక్కడ ఉన్నాయి? అమరావతిలోనా? లేక భూగర్భంలో ఉన్నాయా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రధాని మోదీని కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని, అడిగిన వాటికి సమాధానమివ్వకుండా, సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీకి సంబంధించిన వీడియో క్లిప్స్ ను అసెంబ్లీలో చూపెట్టడం తప్పని, జాతీయ అధ్యక్షుడు లేఖ రాస్తే లేఖ ద్వారానే చంద్రబాబు స్పందించాలి తప్ప ఈ విధంగా అసెంబ్లీలో మాట్లాడటం తగదని అన్నారు. ఏపీలో అవినీతిపై తాము ప్రశ్నిస్తుంటే, దానిని రాష్ట్ర ప్రజలపై జరుగుతున్న దాడిగా చంద్రబాబు అభివర్ణిస్తున్నారని విమర్శించారు.

More Telugu News