karishma bodra: సినీ ఫైనాన్షియర్ కుమార్తె కరిష్మా అదృశ్యం కేసులో కొత్త మలుపు... కావాలనే చెన్నై నుంచి పారిపోయి గుంటూరు చేరిందట!

  • నేనే పారిపోయి వచ్చాను
  • తండ్రి హింస భరించలేకనే
  • పోలీసులకు కరిష్మా స్టేట్ మెంట్

ప్రముఖ దక్షిణాది సినీ ఫైనాన్షియర్ ముకుల్ చంద్ బోద్రా కుమార్తె కరిష్మా అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. గత నెల 28 నుంచి ఆమె కనిపించక పోగా, గుర్తు తెలియని వ్యక్తులపై కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో తొలుత ఆమే స్వయంగా తండ్రికి ఫోన్ చేసి, గుంటూరులోని ఓ పాఠశాలలో తాను ఉన్నట్టు చెప్పింది. ఆపై ముకుల్ అదే విషయాన్ని పోలీసులకు చేరవేయగా, ప్రత్యేక బృందం గుంటూరుకు వచ్చి విచారించగా, కరిష్మా సంచలన విషయాలను వెల్లడించింది.

తన తండ్రి నిత్యమూ కొడుతూ హింసిస్తున్నాడని, అందుకే తాను పారిపోయి వచ్చానని పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. కాగా, ఆమె కోసం గుంటూరుకు వచ్చిన ముకుల్ చంద్, తన కుమార్తెను అప్పగించాలని కోరగా, కేసు నమోదైన కారణంగా కోర్టులోనే ఆమెను హాజరు పరుస్తామని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, గతంలో కుందు వడ్డీ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చిన చరిత్ర ఉన్న ముకుల్, తనను మరోసారి జైలుకు పంపించేందుకు తన కుమార్తెను బెదిరించి, తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించారని ఆరోపించడం గమనార్హం.

More Telugu News