surya: సూర్య మూవీ కోసం భారీ ఖర్చుతో టౌన్ సెట్!

  • సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య 
  • కథానాయికలుగా రకుల్ .. సాయిపల్లవి 
  • రెండవ షెడ్యూల్ కోసం 'టౌన్ సెట్'  

ఒక వైపున హీరోగానూ .. మరో వైపున నిర్మాతగాను సూర్య బిజీగా వున్నాడు. ప్రస్తుతం ఆయన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. రెండవ షెడ్యూల్ ను చెన్నై లో ప్లాన్ చేశారు. తమిళనాడు .. తిరునల్వేలి జిల్లాలోని 'అంబ సముద్రం'ను పోలిన విధంగా అక్కడ ఒక 'టౌన్ సెట్' వేశారట.

భారీ ఖర్చుతో వేసిన ఈ సెట్లో దాదాపు 20 రోజులపాటు షూటింగ్ జరుపుతారని సమాచారం. ప్రధాన పాత్రలన్నీ ఈ షెడ్యూల్లో పాల్గొంటాయని అంటున్నారు. ఈ టౌన్ సెట్లో చేసే సీన్స్ కీలకమైనవనీ .. సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, విలన్ గా జగపతిబాబు పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. సూర్య గత చిత్రాల మాదిరిగానే తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.    

More Telugu News