apple iphone: పెరిగిన యాపిల్ ఐఫోన్ ధరలు... వివిధ మోడళ్ల కొత్త ధరలు ఇలా...!

  • అన్ని మోడళ్లపై ధరలు పెంపు
  • రూ.3,000 వరకు భారం
  • ఐఫోన్ ఎస్ఈ 32జీబీ కొత్త ధర రూ.26,000

యాపిల్ ఐఫోన్ల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలను గమనిస్తే... ఐఫోన్ ఎక్స్ గతంలో ప్రారంభ ధర రూ.92,430 కాగా, నూతన ధర రూ.95,390. అంటే రూ.2,960 పెరిగింది. 256జీబీ మోడల్ ధర అయితే 3,210 పెరిగి రూ.1,08,930కు చేరుకుంది. ఐఫోన్ 8 64జీబీ ధర గతంలో రూ.66,120 కాగా, కొత్త ధర రూ.67,940. 256జీబీ ధర రూ.79,420 నుంచి రూ.81,500కు పెరిగింది.

ఐఫోన్ 8ప్లస్ 64జీబీ ధర రూ.75,450 నుంచి రూ.77,560కు పెరిగింది. 256 జీబీ మోడల్ ధర రూ. 88,750 నుంచి 91,110కు పెరిగింది. ఐఫోన్ 7 32జీబీ మోడల్ 50,810 నుంచి రూ.52,370కు చేరింది. 128 జీబీ మోడల్ ధర రూ.59,910 నుంచి రూ.61,560కు పెరిగింది. ఐఫోన్ 7ప్లస్ బేసిక్ మోడల్ ధర రూ.61,060 నుంచి రూ.62,840కు పెంచడం జరిగింది. 128జీబీ మోడల్ నూతన ధర రూ.72,060.

ఐఫోన్ 6ఎస్ 32జీబీ ప్రారంభ ధర రూ.41,550 నుంచి రూ.42,900కు పెరిగింది. 128జీబీ మోడల్ ధర రూ.50,660 నుంచి రూ.52,100కు చేరింది. ఐఫోన్ 6ఎస్ 32జీబీ మోడల్ రూ.50,740 నుంచి రూ.52,240కు, 128 జీబీ మోడల్ ధర రూ.59,860 నుంచి రూ.61,450కు పెరిగాయి. ఐఫోన్ 6 32జీబీ రూ.30,780 నుంచి రూ.31,900కు పెరిగింది. ఐఫోన్ ఎస్ఈ 32జీబీ మోడల్ రూ.26,000 కాగా, 128జీబీ రూ.35,000గా ఉంది. ఇవన్నీ యాపిల్ అధికారిక గరిష్ట విక్రయ ధరలు. రిటైలర్లు ఇంతకంటే తక్కువకే ఆఫర్ చేయవచ్చు.

More Telugu News