Uttar Pradesh: సినిమా చూసి.. సరదాగా బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసి చంపేశారు!: యూపీలో దారుణం

  • పోలీసుల అదుపులో నిందితులు
  • వారు చెప్పింది విని విస్తుపోయిన  పోలీసులు
  • కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్

మద్యం తాగారు, సినిమా చూశారు.. ఆపై బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు.. విస్తుపోయే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మీరట్‌కు చెందిన అబ్బాసీ, దిల్షద్, ఇజ్రాయెల్‌ స్నేహితులు. వారం క్రితం వీరు ఓ బాలికను కిడ్నాప్ చేసి ఆ తర్వాత దారుణంగా చంపేశారు. బాలిక మృతదేహాన్ని నోయిడాలోని ఓ కాలువలో పడేసి వెళ్లిపోయారు. బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తర్వాతి రోజున నిందితులైన ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రయాణించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో నిందితులు చెప్పిన సమాధానం విని పోలీసులకు కళ్లు తిరిగినంత పనైంది. ఆ రాత్రి మద్యం తాగుతూ ఓ సినిమాను  చూశామని, ఆ తర్వాత సరదాగా బాలికను కిడ్నాప్ చేయాలనుకుని కారులో రోడ్డుపైకి వచ్చామని తెలిపారు. ఆ సమయంలో బాలిక ఒంటరిగా వెళ్తూ కనిపించడంతో బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్టు చెప్పారు. తర్వాత ఆమెపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడి చంపేశామని నింపాదిగా పేర్కొన్నారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News