Virat Kohli: న్యూ ఇయర్ విషెస్ చెప్పి ఓ సెల్ఫీ పోస్ట్ చేసిన కోహ్లీ జంట!

  • నూతన సంవత్సరం ప్రతిఒక్కరికి సంతోషాన్ని ఇవ్వాలి
  • అందరి జీవితాలు ప్రేమ వెలుగులతో నిండాలి
  • శుభకరమైన ఏడాది కావాలి: కోహ్లీ ట్వీట్

కొత్త జంట విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. సుందరమైన సముద్రతీరం..కొండలు..ఆహ్లాదపరిచే వాతావరణం మధ్య ఈ జంట సెల్ఫీ దిగి తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ నూతన సంవత్సరం ప్రతిఒక్కరికి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడంతోపాటు శుభకరమైన ఏడాది కావాలని, అందరి జీవితాలు ప్రేమ వెలుగులతో నిండాలని ఆ ట్వీట్ లో ఆకాంక్షించారు. కాగా, దక్షిణాఫ్రికా సిరీస్ నిమిత్తం గత బుధవారం నాడు కోహ్లీ అక్కడికి వెళ్లాడు. ఈ టూర్ కు కోహ్లీ తన భార్యను కూడా తీసుకెళ్లాడు. ఇరు దేశాల మధ్య ఈ నెల 5 న తొలి టెస్టు మ్యాచ్ కేప్ టౌన్ లో జరగనుంది.

More Telugu News