Vizag: విశాఖ‌ప‌ట్నం చేరుకున్న భార‌త్, శ్రీలంక క్రికెట్ జ‌ట్లు!

  • ఆదివారం చివ‌రి వ‌న్డే
  • 1-1 తో స‌మంగా ఉన్న ఇరు జట్లు
  • చివ‌రి వ‌న్డేపై ఆస‌క్తి
  • విమానాశ్ర‌యంలో క్రికెట‌ర్ల‌కు ఘ‌న స్వాగ‌తం

భార‌త్‌, శ్రీలంక క్రికెట్ జ‌ట్లు విశాఖ‌ప‌ట్నం చేరుకున్నాయి. విమానాశ్రయంలో క్రికెటర్లకు అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వ‌చ్చే ఆదివారం స్థానిక క్రికెట్ స్టేడియంలో ఇరు జ‌ట్ల మ‌ధ్య నిర్ణయాత్మ‌క వ‌న్డే జ‌ర‌గ‌నుంది. మూడు వ‌న్డేల సిరీస్‌లో మొద‌టి మ్యాచ్‌లో శ్రీలంక విజ‌యం సాధించ‌గా, రెండో వ‌న్డేలో టీమిండియా గెలుపొందిన విష‌యం తెలిసిందే. దీంతో చివ‌రి వ‌న్డేపై ఆసక్తి నెల‌కొంది.

చివ‌రి వ‌న్డేలో శ్రీలంక‌పై భార‌త్ గెలిస్తే వ‌న్డే ర్యాంకింగ్స్‌ను మెరుగుప‌ర్చుకునే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ లో సౌతాఫ్రికా 120 పాయింట్ల‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా, భార‌త్ 199 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక‌తో మొద‌టి వ‌న్డేలోనూ భార‌త్ గెలిస్తే ఇప్ప‌టికే అగ్ర‌స్థానంలో నిలిచి ఉండేది.

More Telugu News