mohan babu: మోహన్ బాబు 'గాయత్రి' రిలీజ్ డేట్ ఖరారు

  • మోహన్ బాబు ప్రధాన పాత్రగా 'గాయత్రి'
  • ప్రత్యేక పాత్రలో మంచు విష్ణు 
  • ఫిబ్రవరి 9వ తేదీన విడుదల

మోహన్ బాబు ప్రధాన పాత్రలో 'గాయత్రి' సినిమా తెరకెక్కుతోంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా మదన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

 మోహన్ బాబు పాత్ర ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుందనీ, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఆయన కెరియర్లో చెప్పుకోదగిన పాత్ర అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచు విష్ణు ప్రత్యేకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, శ్రియ .. నిఖిలా విమల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. 

More Telugu News