Vijay rupani: గుజరాత్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. పాకిస్థాన్‌లో బాణసంచా వెలుగులే వెలుగులు!: గుజరాత్ సీఎం

  • కాంగ్రెస్‌ను ఎద్దేవా చేసిన గుజరాత్ సీఎం
  • కాంగ్రెస్ గెలిస్తే పాక్‌లో.. బీజేపీ గెలిస్తే గుజరాత్‌లో సంబరాలు చేసుకుంటారని వ్యాఖ్య
  • గెలుపు కోసం కాంగ్రెస్-పాక్ చేతులు కలిపాయన్న ప్రధాని

గుజరాత్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ విజయం సాధిస్తే దాయాది పాకిస్థాన్ పండుగ చేసుకుంటుందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. కాంగ్రెస్ విజయం సాధించిన మరుక్షణం పాకిస్థాన్‌లో సంబరాలు మిన్నంటుతాయని, బాణసంచా కాల్చి పండుగ చేసుకుంటారని అన్నారు. అదే బీజేపీ గెలిస్తే గుజరాత్‌ ప్రజలు పండుగ చేసుకుంటారని అన్నారు.

గుజరాత్ ఎన్నికల రెండో విడత ఎన్నికల ప్రచారం చివరి రోజున ఆనంద్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గతంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ గుజరాత్‌లో గెలుపు కోసం పాకిస్థాన్‌తో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించారు.

More Telugu News