India: డక్కౌట్ అయిన కార్తీక్... తల పట్టుకుని కూర్చున్న రోహిత్ శర్మ!

  • మూడో వికెట్ కోల్పోయిన భారత్
  • ఎల్బీ రూపంలో కార్తీక్ అవుట్
  • మూడంకెల స్కోరు లేకుండానే 3 వికెట్లు డౌన్

ధర్మశాలలో శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ చేతులెత్తేసింది. ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును బాధ్యతాయుతంగా ఆదుకోవాల్సిన కార్తీక్ కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. లక్మల్ బౌలింగ్ లో పరుగులేమీ చేయకుండానే ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. దీంతో బోర్డుపై రెండంకెల స్కోరు చేరకుండానే భారత్ 3వ వికెట్ ను కోల్పోయింది.

ఇప్పటికే పెవీలియన్ కు చేరిన కెప్టెన్ రోహిత్ శర్మ, కార్తీక్ అవుట్ అయిన తీరు చూసి తలపట్టుకుని కూర్చున్న దృశ్యాలు లైవ్ లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయ్యర్ కు తోడుగా ఎంకే పాండే క్రీజులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో భారత్ నిలవాలంటే, వీరిద్దరిలో ఒకరు బ్యాటింగ్ చేయాల్సి వుండగా, మరో వికెట్ కోల్పోతే మాజీ కెప్టెన్ ధోనీ, ఆపై పాండ్యా బ్యాటింగ్ లైన్ లో ఉన్నారు. ఆపై మిగిలినదంతా బౌలర్లే కావడంతో భారమంతా ఈ నలుగురి పైనే ఉన్నట్టు.

More Telugu News