allu sirish: హిమాచల్ సరిహద్దు రోహ్ తంగా పాస్ లో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్, స్నేహ, రాంచరణ్.. అల్లు శిరీష్ తీసిన ఫోటోలు చూడండి!

  • కులు - మనాలి వెళ్లిన అల్లు అర్జున్, రాంచరణ్ ఫ్యామిలీలు
  • సరదాగా శీతాకాలాన్ని గడుపుతున్న హీరోలు
  • ఫొటోలు షేర్ చేసిన అల్లు శిరీష్

హిమాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతమైన రోహ్ తంగా పాస్ వద్ద లోతైన లోయలు, ఎత్తయిన కొండల నడుమ తమ జీవిత భాగస్వాములతో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్, రాం చరణ్ లు అభిమానులతో మరిన్ని ఫోటోలను పంచుకున్నారు. ఓ కొండ చరియ అంచుపై స్నేహతో కలిసున్న అల్లు అర్జున్, మరో కొండపై రాంచరణ్ ఉన్న ఫోటోలను అల్లు శిరీష్ విడుదల చేశాడు. ఈ ఫొటోలను తానే తీశానని చెప్పాడు. తన వద్ద ఉన్న వన్ ప్లస్ ఫోన్ తో ఈ చిత్రాలను బంధించానని చెప్పాడు. కులూ-మనాలీ పర్యటనకు వెళ్లిన వీరంతా శీతాకాలాన్ని సరదాగా గడుపుతున్నారు. ఆ ఫోటోలను మీరూ చూడండి.
 

More Telugu News