Rashi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన రాశిఖన్నా
  • 'అదిరింది' సినిమా షూటింగ్ పూర్తి 
  • ప్రేగ్ సిటీలో నాని షూటింగ్ 
  • మణిరత్నం సినిమా అధికారిక ప్రకటన

*  'జై లవ కుశ' సినిమాలో ఓ పాట పాడాలని ఉన్నప్పటికీ పాడలేకపోయానని చెబుతోంది కథానాయిక రాశిఖన్నా. "దర్శకుడు బాబీ కూడా ఈ విషయంలో నన్ను ప్రోత్సహించారు. అయితే, టైం సమస్య వచ్చింది. తమిళంలోనూ, మలయాళంలోను కొన్ని సినిమాలు చేస్తున్నాను. వాటితో బిజీ కావడం వల్ల పాడలేకపోయాను" అని చెప్పింది రాశి.      
*  తమిళ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న 61వ చిత్రాన్ని 'అదిరింది' పేరిట తెలుగులోకి డబ్ చేస్తున్నారు. అట్లీకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. దీనిని దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కాజల్, సమంతా, నిత్యా మీనన్ కథానాయికలుగా నటించారు.
*  నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న 'కృష్ణార్జున యుద్ధం' చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ సిటీలో జరుగుతోంది. ఇరవై రోజుల పాటు అక్కడ షూటింగ్ నిర్వహిస్తారు.          
*  మణిరత్నం చేసే తదుపరి చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఆయన తాజా చిత్రం షూటింగ్ జనవరి నుంచి మొదలవుతుంది. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫహాద్ ఫాజిల్, ఐశ్వర్య రాజేష్, జ్యోతిక తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తారు.   

More Telugu News