Pragya: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు లక్కీ ఛాన్స్ తగిలినట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి సరసన నాయికగా నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మకు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో మూడవ కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ కు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
*  శర్వానంద్ హీరోగా మారుతి రూపొందిస్తున్న 'మహానుభావుడు' చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు. మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని విజయదశమికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
*  'శమంతకమణి' చిత్రం తర్వాత ప్రస్తుతం 'వీరభోగ వసంతరాయలు' చిత్రంలో నటిస్తున్న సుధీర్ బాబు నటించే తదుపరి చిత్రం ఖరారైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో సుధీర్ బాబు నటిస్తాడట.  

More Telugu News