prabhas: స్కూబా డైవింగ్ లో శిక్షణ పొందుతోన్న ప్రభాస్

ప్రభాస్ తాజా చిత్రంగా దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ ను తీసుకున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మిగతా భాషల్లో అనువదించి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

 ఈ సినిమాలో అండర్ వాటర్ లో జరిగే ఫైటింగ్ సీక్వెల్ ఒకటి ఉందట. అది ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా చిత్రీకరించాలనుకుంటున్నారు. ఇందుకోసం ప్రభాస్ 'స్కూబా డైవింగ్' లో శిక్షణ పొందుతున్నట్టుగా తెలుస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో, విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రధానమైన పాత్రను పోషించనున్నట్టు చెబుతున్నారు. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.    

More Telugu News