allu arjun: ఇక అల్లు అర్జున్ వంతు వచ్చేసింది!

అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తెరకెక్కుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. అల్లు అర్జున్ పాత్ర ప్రమేయం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తూ వచ్చారు. రెండవ షెడ్యూల్ ను ఈ నెల 18వ తేదీ నుంచి మొదలెట్టనున్నారు. ఆ రోజు నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకూ కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

 ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ పాల్గొంటాడు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ పాత్రలో కనిపించనుండగా, మరో ముఖ్యమైన పాత్రలో శరత్ కుమార్ నటిస్తున్నాడు. విశాల్ - శేఖర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.   

More Telugu News