Prabhas: 'సాహో' కథపై రకరకాల ఊహాగానాలు!

ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. భారీ సంఖ్యలో గుర్రాలను తెప్పించి యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ యుద్ధ సన్నివేశాల కంటే ముందు 'పోలో' ఆటకి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

ఇది టైమ్ ట్రావెల్ కి సంబంధించిన కథ అని కొంతమంది అంటున్నారు. లేదు .. పునర్జన్మకి సంబంధించిన కథ అని మరికొందరు చెబుతున్నారు. ఇదలా ఉంచితే, ఈ సినిమాలో ప్రభాస్ చేస్తున్నది డ్యూయెల్ రోల్ అని మాత్రం అంతా అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి కథానాయికల విషయంలోను ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయోమయానికి లోనవుతోన్న అభిమానుల కోసం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News