: పుణెలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుళ్లు... ఇద్దరు దుర్మరణం!

మహారాష్ట్రలోని పుణె పట్టణంలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ రోజు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరికొంత మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. పేలుళ్లకు కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. రక్షణ శాఖ పరిధిలోని ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేశంలో ఎంతో కాలంగా ఉన్న వాటిలో ఒకటి. 1920లో ఇక్కడ తయారీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పుణెలోని ఖడ్కి వద్ద ఇది ఉంది. రాత్రి పూట యుద్ధం చేసేందుకు వీలుగా సైన్యం, భద్రతా బలగాలకు అవసరమైన ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయి.

More Telugu News