: టీచర్ల ప్రవర్తన 'నీట్'గా లేదని.. నలుగురిపై సస్పెన్షన్ వేటు!

రెండు రోజుల క్రితం దేశ వ్యాప్తంగా నీట్ ఎంట్రన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. కేరళలోని కన్నూరులో ఓ పరీక్షా కేంద్రంలో ఎంట్రన్స్ రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థినిని డ్రెస్ కోడ్ పేరిట ఆమెను టీచర్లు ఇబ్బందిపెట్టిన విషయం తెలిసిందే. బ్రా ధరించిన కారణంగా పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థిని అనుమతించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం నలుగురు టీచర్లను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, సదరు విద్యార్థిని తనను అనుమతించకపోవడంతో, వెంటనే బయటకు వచ్చిన ఆమె తన టాప్ ఇన్నర్ వేర్ ను తన తల్లి చేతిలో పెట్టి పరీక్షా కేంద్రంలోకి వెళ్లాల్సి వచ్చింది.

More Telugu News