: ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే రిసార్ట్ కు బయల్దేరిన ఎమ్మెల్యేలు

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే తిరిగి కువత్తూరులోని గోల్డెన్‌ బే రిసార్ట్స్ కు వెళ్లారు. బలనిరూపణ లోగా ఎమ్మెల్యేలను ఇళ్లకు పంపిస్తే, బేరసారాలతో కొందరు చేజారే ప్రమాదం ఉందని పళనిస్వామితో పాటు శశికళ మనుషులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బలనిరూపణ జరిగేవరకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా రిసార్ట్స్ లోనే విశ్రాంతి తీసుకోనున్నారు.  ఈ క్రమంలో శనివారం బలనిరూపణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

More Telugu News