: ‘నేనొక లాయ‌ర్ ను ప‌క్కకు త‌ప్పుకోండి’ అంటూ హైకోర్టు వద్ద రౌడీషీటర్ అలజడి

‘నేనొక లాయ‌ర్ ను ప‌క్కకు త‌ప్పుకోండి’ అంటూ ఓ రౌడీషీట‌ర్ హైదరాబాద్‌ హైకోర్టు దగ్గర హడావుడి చేశాడు. అంద‌రినీ నెట్టుకుంటూ ఏకంగా కోర్టులోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో అక్క‌డ కాసేపు అల‌జ‌డి చెల‌రేగింది. ఓ కేసు విషయంలో సుభాష్ చంద్రబోస్‌ అనే రౌడీషీటర్ ఈ రోజు హైకోర్టు ముందు హాజ‌రుకావాల్సి ఉంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అక్క‌డ‌కు వ‌చ్చాడు. అయితే, మ‌రో కేసులోనూ నిందితుడిగా ఉన్న చంద్ర‌బోస్‌.. పోలీసుల క‌ళ్లుగ‌ప్పి నాలుగేళ్లుగా తిరుగుతున్నాడు. ఈ రోజు స‌ద‌రు రౌడీషీట‌ర్‌ హైకోర్టుకు హాజరవుతున్నాడ‌న్న స‌మాచారం అందుకున్న ఎస్సార్‌ నగర్ పోలీసులు అక్క‌డికి ముందే చేరుకొని బోస్‌ను పట్టుకునేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో బోస్ తప్పించుకునేందుకు దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తూ క‌ల‌క‌లం రేపాడు. ఎట్ట‌కేల‌కు అత‌డిని  పోలీసులు అరెస్టు చేశారు. 

More Telugu News