: ‘శాతకర్ణి’ పతాకాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ

విశాఖపట్టణంలోని  జ్యోతి థియేటర్లో ‘శాతకర్ణి’ పతాకాన్ని ఆ చిత్ర కథానాయకుడు బాలకృష్ణ ఆవిష్కరించారు. బాలకృష్ణ వందో సినిమా అయిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి పండగకు విడుదల కానున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వంద థియేటర్లలో శాతకర్ణి పతాకావిష్కరణ ఒకేసారి జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణకు వేలాది అభిమానుల మధ్య ఘనస్వాగతం లభించింది. కాగా, ఈరోజు ఉదయం సింహాచలం అప్పన్న స్వామిని బాలకృష్ణ దర్శించుకున్నారు.
 

More Telugu News