: ఇకపై శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చు... కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ప్రముఖ ఆలయం శబరిమలలోకి మహిళల ప్రవేశానికి కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శబరిమల గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించవచ్చంటూ ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటనపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా శబరిమల గుడిలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ మహిళా సంఘాలు ఆందోళన జరుపుతున్న విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం తాజా ప్రకటనతో ఇకపై శబరిమల గర్భాలయంలోకి మహిళల ప్రవేశానికి మార్గం సుగమమైంది.

More Telugu News