: హరీశ్, దేవినేని మధ్య మాటలు అదుపు తప్పిన వేళ, ఉమా భారతి 'చాయ్' సలహా!

అపెక్స్ కౌన్సిల్ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణా జలాల విషయమై వాదిస్తున్న వేళ, ఓ దశలో తీవ్ర వాగ్వాదం జరగడంతో కేంద్ర మంత్రి ఉమాభారతి స్వయంగా కల్పించుకోవాల్సి వచ్చింది. నందిగామ ప్రాంతానికి తెలంగాణ భూభాగం నుంచి నీరివ్వాలని, అందుకు సహకరించాలని ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రస్తావించినప్పుడు, తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలకు దిగినట్టు తెలుస్తోంది. తాము సహకరిస్తున్నా, ఏపీ తమ ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన గట్టిగా మాట్లాడారు. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నందున, ఆదా అయ్యే నీటిలో తమకూ వాటా కావాల్సిందేనని హరీశ్ వాదించారు. మాటలు అదుపు తప్పుతున్నాయని భావించిన ఉమా భారతి జోక్యం చేసుకుని ప్రశాంతంగా ఉండాలని సూచించారు. "అప్పుడప్పుడూ కలిసి చాయ్ తాగండి. మాట్లాడుకోండి. ఇలాంటి విభేదాలుండవు" అంటూ వారిని సముదాయించారు.

More Telugu News