: పనిలేక, ప్రచారం కోసమే...: పేస్ పై బోపన్న విసుర్లు

ఒలింపిక్స్ పోటీల్లో సానియా మీర్జాతో తాను కలిసి మిక్సెడ్ డబుల్స్ ఆడితే విజయం సాధ్యమయ్యేదని, సరైన జోడీని పంపడంలో విఫలమయ్యారని లియాండర్ పేస్ ఆరోపణలు గుప్పించిన వేళ, సానియా మీర్జా 'విషపూరితమైన వ్యక్తి' అంటూ వ్యాఖ్యానించగా, ఆ వెనుకే రోహన్ బోపన్న కూడా విరుచుకుపడ్డాడు. పేస్ పేరు చెప్పకుండా విమర్శలు చేశాడు. ఆ ఆటగాడికి పని లేదని, మీడియాలో ప్రచారం కోసం చౌకబారు ఆరోపణలు చేస్తున్నాడని అన్నాడు. తోటి ఆటగాళ్లను టార్గెట్ చేసుకుని మాట్లాడటం అతనికి పరిపాటేనని చెప్పుకొచ్చాడు. గత ఒలింపిక్స్ లో సానియాతో జతకట్టిన రోహన్ బోపన్న పతక వేటలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

More Telugu News