: ఎన్ఎస్జీలో భారత్ కు అవకాశమిస్తే మాకు ప్రమాదం: చైనా అధికార మీడియా

న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం పొందేందుకు ఇండియా మరో అడుగు ముందుకు వేసిన వేళ, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా, తన స్వరాన్ని మరింతగా పెంచింది. ఎన్ఎస్జీలో ఇండియాను చేరిస్తే, పాకిస్థాన్ ను రెచ్చగొట్టినట్టు అవుతుందని ఆ దేశ అధికార మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తమ దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని, అది తమకు ప్రమాదమని పేర్కొంది. దక్షిణాసియాలో తీవ్ర అణ్వస్త్ర పోటీ నెలకొంటుందని తన భయాన్ని వ్యక్తం చేస్తూ, ఇండియాకు సభ్యత్వం ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది.

More Telugu News