: లియాండర్ పేస్ కు షాకిచ్చిన రోహన్ బోపన్న... విశాఖ కుర్రాడు సాకేత్ తో కలిసి ఒలింపిక్ లోకి ఎంట్రీ

భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఒలింపిక్ ఆశలపై మరో టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న నీళ్లు చల్లాడు. మొన్నటిదాకా పేస్ తోనే కలిసి టెన్నిస్ ఆడిన రోహన్... త్వరలో జరగనున్న ఒలింపిక్స్ లో పేస్ తో కలిసి ఆడేందుకు నిరాకరించారు. టెన్నిస్ లో ఒక్కో మెట్టే ఎక్కుతూ సత్తా చాటుతున్న విశాఖ కుర్రాడు సాకేత్ సాయి మైనేనితో కలిసి ఒలింపిక్ బరిలోకి దిగాలని రోహన్ నిర్ణయించుకున్నాడు. దీంతో ఒలింపిక్స్ పై గంపెడాశలు పెట్టుకున్న లియాండర్ కు పెద్ద దెబ్బే తలిగింది. ఇప్పటికే హైదరాబాదీ టెన్నిస్ సంచలనం సానియా మీర్జాతో కలిసి మిక్స్ డ్ డబుల్స్ ఆడిన సాకేత్ సాయి పలు టోర్నీల్లో సత్తా చాటాడు.

More Telugu News