: అంతమంది ఎమ్మెల్యేలను ఎలా ఆకర్షించారో కేసీఆర్ చెప్పాలి: జీవన్ రెడ్డి

'ఓటుకు నోటు' వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వాల అధినేతల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. సీఎంలు కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ తోడుదొంగలేనని వ్యాఖ్యానించారు. అసలు ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన 13 మంది ఎమ్మెల్యేలను ఎలా ఆకర్షించారో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. పార్టీల ఫిరాయింపులను గవర్నర్ ఎందుకు పట్టించుకోవట్లేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.