: 'హీరో' కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ లో 'హీరో' పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం, హీరో మోటార్స్ సంస్థకు మధ్య ఈరోజు ఒప్పందం కుదిరింది. కంపెనీ ప్రతినిధి రాకేశ్ వశిష్ట్ తో ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్ స్థాపన కోసం చిత్తూరు జిల్లా శ్రీసిటీ సమీపంలో 600 ఎకరాలు కేటాయించారు. 18 నెలల్లో హీరో మోటార్ సైకిళ్ల తయారీ ప్లాంటు నిర్మాణం పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా పదివేల మందికి ఉపాధి లభిస్తుంది. వీలైనంత త్వరగా ప్లాంటు ఏర్పాటుకు సంస్థ ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు 'హీరో' ప్రతినిధులను కోరారు.