: అధికారులకు ఫిర్యాదు చేశారని సర్పంచ్ కుటుంబాన్నే వెలివేశారు

తమ కళ్ళెదుట జరుగుతున్న అవినీతిపై అధికారులకు ఫిర్యాదు చేసినందుకు సర్పంచ్ కుటుంబానికి గ్రామస్థులు తీవ్రమైన శిక్ష విధించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరు గ్రామంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఆ గ్రామ సర్పంచ్ శోభ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్థులు ఆ కుటుంబాన్ని వెలివేసి, లక్ష రూపాయల జరిమానా విధించారు. దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ అమానవీయ సంఘటనకు పాల్పడిన చింతలూరు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని దళిత సంఘాలు నిర్ణయించాయి.

More Telugu News