: మైనర్ బాలికమీద సామూహిక అత్యాచారం


మరో సామూహిక అత్యాచార ఘటన బీహార్ రాష్ట్రంలోని ససారమ్ జిల్లా కేఖాని గ్రామంలో జరిగింది. మైనర్ బాలిక(16) మీద నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. రాత్రి ఓ సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తోన్న బాలికపై దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మిగతా వారికోసం గాలిస్తున్నారు. బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News