: కర్ణాటక శాసనసభకు మే 5 న ఎన్నికలు


కర్ణాటక శాసనసభ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఏప్రిల్ 10న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 17న నామినేషన్ల స్వీకరణకు తుది గడువని తెలిపారు.18న నామినేషన్లు పరిశీలిస్తామన్నారు. ఏప్రిల్ 20న నామినేషన్ల ఉపసంహరించుకోవచ్చన్నారు. మే 5 న పోలింగ్ నిర్వహిస్తామన్నారు. 8న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారని తెలిపారు.

జూన్ 3వ తేదీతో కర్ణాటక శాసనసభ పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ఈ ప్రకటన చేసింది. 4.18 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారని ఈసీ తెలిపారు. ఇందుకోసం 50,446 పోలింగు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఈవీఎంల ద్వారానే ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. 98.6 శాతం మందికి ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామని చెప్పారు. ఇకనుంచి మీడియాలో చెల్లింపు వార్తలపై నిఘా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News