Vande Bharat: వైజాగ్ లో వందేభారత్ రైలుపై రాళ్లదాడి

  • సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య పరుగులు పెట్టనున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్
  • వైజాగ్ వచ్చిన రైలుపై దాడి చేసిన ఆగంతుకులు
  • రెండు బోగీల అద్దాలు ధ్వంసం
Stones pelted on Vande Bharat express in Vizag

సికింద్రాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య పరుగులు పెట్టడానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ 'వందే భారత్' ఎక్స్ ప్రెస్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో సికింద్రాబాద్ లో ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా ఈరోజు వైజాగ్ కు వందేభారత్ రైలు వచ్చింది. అయితే ఈ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది రాళ్ల దాడేనని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ఈ ఘటనపై డీఆర్ఎం అనూప్ సత్పతి విచారణకు ఆదేశించారు.

More Telugu News