Narendra Modi: కాశీ-తమిళ్ సంగమం గంగ, యమున అంత పవిత్రమైనది: ప్రధాని నరేంద్ర మోదీ

  • కాశీ-తమిళ్ సంగమం ప్రారంభించిన మోదీ
  • వారణాసిలో కార్యక్రమం
  • నెలరోజుల పాటు సాగనున్న వేడుక
PM Modi inaugurates Kashi Tamil Confluence

దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను పురాతన సంస్కృతి, జ్ఞానం తదితర అంశాల ద్వారా అనుసంధానించే లక్ష్యంతో కాశీ-తమిళ్ సంగమం కార్యాచరణ ఏర్పాటు చేసిన సంగత తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం-ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ వేడుకలు నెల రోజుల పాటు జరగనున్నాయి. 

ఈ నేపథ్యంలో, ప్రతిష్ఠాత్మక కాశీ-తమిళ్ సంగమాన్ని ప్రధాని మోదీ నేడు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మోదీ తమిళ సంస్కృతిని ప్రతిబింబించే వేషధారణలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మ్యాస్ట్రో ఇళయరాజా కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, కాశీ-తమిళ్ సంగమం గంగ, యమున అంత పవిత్రమైనదని అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన తమిళ్ కు భారతదేశం పుట్టిల్లు అని వెల్లడించారు. అందుకు మనమంతా గర్వించాలని, ఆ భాష పరిరక్షణకు మరింతగా కృషి చేయాలని పేర్కొన్నారు.

More Telugu News