Charan: చరణ్ .. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు లేనట్టే!

  • శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చరణ్ 
  • గౌతమ్ తిన్ననూరితో చేయవలసిన సినిమా కేన్సిల్
  • అతని హిందీ 'జెర్సీ' ఫ్లాప్ కావడమే కారణమంటూ టాక్
  • విజయ్ దేవరకొండతో గౌతమ్ సినిమా ఉండే ఛాన్స్     
Charan and Goutham movie update

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని అలరించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. చరణ్ ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరితో కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించవలసిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు కేన్సిల్ అయినట్టుగా మేకర్స్ ప్రకటించారు.

గౌతమ్ తిన్ననూరి తొలి సినిమా అయిన 'జెర్సీ'తో సూపర్ హిట్ అందుకున్నాడు. అదే కథను హిందీలో రీమేక్ చేశాడు. అయితే అక్కడ ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. ఈ లోగా చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అందువలన గౌతమ్ కథ పాన్ ఇండియా స్థాయిలో లేదనే కారణంగా చరణ్ ఆసక్తి చూపకపోవడం జరిగిందని అంటున్నారు. 

ఈ కారణంగానే చరణ్ - గౌతమ్ కాంబినేషన్ కి ఆదిలోనే అడ్డుకట్ట పడింది. శంకర్ తరువాత చరణ్ ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడనేది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక గౌతమ్ తిన్ననూరి మాత్రం దిల్ రాజు నిర్మాతగా ... విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

More Telugu News