deepavali: సరిహద్దుల్లో జవాన్ల దీపావళి

  • దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చి వేడుకలు
  • దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన సైనికులు
  • భద్రత బాధ్యత తమకు వదిలి పండుగ సంతోషంగా జరుపుకోవాలని సూచన
Indian Army jawans extend festive wishes

దీపావళి సందర్భంగా దేశమంతటా జనం వేడుకలు జరుపుకుంటున్నారు.. విదేశాల్లోనూ దీపాల పండుగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. పండగపూట సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇంటికి దూరంగా ఉన్నామనే లోటు కనిపించకుండా సంతోషంగా గడిపారు. రోజూ విధులు నిర్వహించే చోటే పండుగను జరుపుకున్నారు. ధన త్రయోదశి సందర్భంగా లక్ష్మీ దేవీకి పూజలు చేశారు. ఈ సందర్భంగా కొంతమంది జవాన్లు విలేకరులతో మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సరిహద్దుల్లో తామంతా అప్రమత్తంగా ఉన్నామని, భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా సంతోషంగా దీపావళి జరుపుకోవాలని సూచించారు.
 
ఈ ఏడాది కూడా సైనికుల మధ్యే ప్రధాని

ఏటా దీపావళికి ప్రధాని నరేంద్ర మోదీ సైనికులతో కలిసి వేడుకలు జరుపుకోవడం తెలిసిందే. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన దీపావళి వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా దీపావళి వేడుకలను సైనికుల మధ్యే జరుపుకోనున్నట్లు సమాచారం. అయితే, అది ఎక్కడ అనేది మాత్రం అధికారులు వెల్లడించలేదు. భద్రతా కారణాలరీత్యా ఈ విషయాన్ని చివరి నిమిషం వరకూ రహస్యంగా ఉంచనున్నారు.

More Telugu News