Sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 38 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 12 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3.80 శాతం లాభపడ్డ కోటక్ బ్యాంక్ షేర్ 
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయిన మార్కెట్లు చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 38 పాయింట్ల లాభంతో 60,298కి చేరుకుంది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 17,957 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: 
కోటక్ బ్యాంక్ (3.80%), ఎల్ అండ్ టీ (2.03%), భారతి ఎయిర్ టెల్ (1.61%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.53%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.31%). 

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-2.30%), విప్రో (-1.67%), ఇన్ఫోసిస్ (-1.38%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.92%), యాక్సిస్ బ్యాంక్ (-0.87%).

More Telugu News