CM Jagan: 'ఎట్ హోమ్'లో దూరం దూరంగా సీఎం జగన్, చంద్రబాబు!

  • రాజ్ భవన్ లో గవర్నర్ తేనీటి విందు
  • హాజరైన సీఎం జగన్, చంద్రబాబు
  • పరస్పరం ఎదురుపడకుండానే వెనుదిరిగిన వైనం
CM Jagan and Chandrababu maintains distance in Raj Bhavan

విజయవాడలోని రాజ్ భవన్ లో ఇవాళ ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆతిథ్యమిచ్చారు. గవర్నర్ ఆహ్వానం అందుకుని ఎట్ హోమ్ కు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబు దూరం దూరంగానే ఉన్నారు. ఎక్కడా ఒకరికొకరు ఎదురుపడలేదు. సతీసమేతంగా విచ్చేసిన సీఎం జగన్ గవర్నర్ తో కలిసి ఓ టేబుల్ వద్ద కూర్చోగా, టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు మరో టేబుల్ వద్ద కూర్చున్న దృశ్యాలు కనిపించాయి.  

అసెంబ్లీలో తప్ప జగన్, చంద్రబాబు ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదైన విషయం. దాంతో మీడియా దృష్టంతా ఈ ఎట్ హోమ్ కార్యక్రమంపైనే నిలిచింది. అయితే వీరిద్దరూ పరస్పరం ఎదురుపడకుండానే కార్యక్రమం నుంచి వెనుదిరిగారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి ఏపీ మంత్రుల్లో పలువురు హాజరయ్యారు.
.

More Telugu News