Corona Virus: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 17,521 కరోనా పరీక్షలు
  • 265 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 142 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 528 మంది
  • ఇంకా 3,183 మందికి చికిత్స
Corona positive cases number declines in Telangana

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 17,521 శాంపిల్స్ పరీక్షించగా, 265 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 142 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 14 కేసులు గుర్తించారు. మరో 301 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 528 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,29,467 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,22,173 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,183 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

More Telugu News