Mani Ratnam: కరోనాతో ఆసుపత్రిలో చేరిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం

  • చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన మణిరత్నం
  • వివరాలు వెల్లడించని వైద్యులు
  • ‘పొన్నియన్ సెల్వన్’ పోస్టు ప్రొడక్షన్ వర్క్‌లో బిజీ
Mani Ratnam admitted to Chennai hospital after testing Covid positive

ఇటీవల కరోనా బారినపడిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన భార్య, నటి సుహాసిని త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా కోసం పనిచేస్తున్నారు.

ఈ నెల 8న నిర్వహించిన ఈ సినిమా టీజర్ లాంచింగ్‌కు మణిరత్నం ఇటీవల హాజరయ్యారు. ఇదే సినిమా పోస్టుప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్న ఆయనకు ఇటీవల కొవిడ్ సోకింది. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సంబంధించిన వివరాలను వైద్యులు కూడా వెల్లడించలేదు.

More Telugu News