GST rates: నేటి నుంచి వీటి ధరలు ప్రియం.. కొత్త జీఎస్ టీ రేట్లు వీటిపైనే..

  • విద్యా సంబంధిత స్టేషనరీ ఉత్పత్తులపై రేట్ల పెంపు
  • బ్యాంకు చెక్ బుక్ ల చార్జీపైనా 18 శాతం జీఎస్టీ
  • ప్యాక్ చేసి విక్రయించే ఆహారోత్పత్తులపైనా బాదుడు
  • రోప్ వే సర్వీసులపై చార్జీ తగ్గింపు
New GST rates today onwards Check whats costlier whats cheaper here

కొన్ని ఉత్పత్తులు, సేవలపై నూతన జీఎస్టీ రేట్లు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల కొన్నింటి ధరలు పెరిగిపోగా, కొన్ని తగ్గాయి. గత నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు రేట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి.

రేట్లు పెరిగేవి..

  • ప్యాక్ చేసి విక్రయించే ఆహార ఉత్పత్తులు (మనం కొనుగోలు చేసే తినుబండారాలు, అప్పడాలు, మురుకులు, జంతికలు, మిక్చర్ తదితర), ప్యాక్ చేసి విక్రయించే ఆటా పిండి (బ్రాండెడ్ కాకపోయినా సరే, షాపుల్లో లోకల్ గా ప్యాక్ చేసి విక్రయించేవి), పెరుగు, ఆసుపత్రుల్లో రూ.5,000కు మించిన రూమ్ రెంట్ పై కొత్తగా 5 శాతం జీఎస్టీ వేశారు. ఇప్పటి వరకు వీటిపై జీఎస్టీ లేదు. 
  • టెట్రా ప్యాక్ లపై 18 శాతం జీఎస్టీ అమలు కానుంది. 
  • అలాగే, బ్యాంకులు చెక్కుల జారీ కోసం వసూలు చేసే చార్జీపై 18 శాతం జీఎస్టీ పడుతుంది.
  • మ్యాప్ లు, చార్ట్ లు, అట్లాస్ లపైనా 12 శాతం జీఎస్టీ చెల్లించుకోవాలి.
  • ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్.. చాకులు, పేపర్లను కత్తిరించే చాకులు, పెన్సిల్ షార్ప్ నర్లు, ఎల్ఈడీ ల్యాంపులపై 12 శాతంగా ఉన్న జీఎస్టీ 18 శాతానికి పెరిగింది. 
  • సోలార్ వాటర్ హీటర్లపై ఇప్పటి  వరకు 5 శాతం జీఎస్టీ ఉంటే, 12 శాతానికి పెంచారు. 
  • రహదారులు, వంతెనలు, రైల్వేలు, మెట్రోలు, అఫ్లూయంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్లకు సంబంధించి కాంట్రాక్టు పనులు, శ్మశాన వాటికల సేవలపై 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచారు.

ధరలు తగ్గేవి..
  • రోప్ వేల ద్వారా వస్తువుల రవాణా, ప్రయాణికుల రవాణా సేవలపై 12 శాతం జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించారు. 
  • వాయు మార్గంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి, ఈశాన్య రాష్ట్రాలకు, బాగ్రోడియాకు తీసుకెళ్లే ప్రయాణికుల సేవలపై జీఎస్టీ మినహాయించారు. 
  • ట్రక్కులు, గూడ్స్ క్యారియర్ల అద్దెలపై సర్వీస్ చార్జీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. 
  • ఎలక్ట్రిక్ వాహనాలు 5 శాతం రాయితీ జీఎస్టీ రేటుకు లభిస్తాయి.  

More Telugu News