Tollywood: స్థ‌ల వివాదంలో కోర్టు విచార‌ణ‌కు హాజ‌రైన సినీ న‌టుడు రానా

  • ఫిల్మ్ న‌గ‌ర్ స్థ‌లం రానా పేరిట‌ రిజిస్ట‌ర్ అయిన వైనం
  • ఈ స్థ‌ల‌ వివాదంలోనే రానాకు కోర్టు నోటీసులు
  • విచార‌ణ‌ను ఈ నెల 14కి వాయిదా వేసిన కోర్టు
actor rana daggubati attends city civil court hearing

టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు ద‌గ్గుబాటి రానా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. ఓ స్థ‌లానికి సంబంధించి దాఖలైన పిటిష‌న్‌లో గ‌తంలో రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల మేర‌కు మంగ‌ళ‌వారం రానా కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. ఈ వ్య‌వ‌హారంపై త‌దుప‌రి విచార‌ణ‌ను కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.

ఈ వివాదం వివ‌రాల్లోకెళితే... హైద‌రాబాద్‌లోని ఫిల్మ్ న‌గ‌ర్ ప‌రిధిలో ఓ స్థ‌లాన్ని 2014లో ఓ సంస్థ లీజుకు తీసుకుంది. అయితే సదరు సంస్థ య‌జ‌మాని కుమారుడు ఆ స్థలాన్ని ద‌గ్గుబాటి రానా పేరిట రిజిస్ట‌ర్ చేసిన‌ట్లుగా కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

More Telugu News