England: ఇంగ్లండ్‌తో తొలి వ‌న్డే... టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

  • ఓవ‌ల్ వేదిక‌గా మ‌రికాసేప‌ట్లో మ్యాచ్‌
  • ఇంగ్లండ్‌ను ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించిన రోహిత్ శ‌ర్మ‌
  • వ‌న్డే సిరీస్‌పై గురి పెట్టిన ఇరు జ‌ట్లు
rohit sharma wins the toss and elected to bowl first

ఇంగ్లండ్‌తో 3 వ‌న్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సార‌థి రోహిత్ శ‌ర్మ‌... తొలుత ఫీల్డింగ్ చేయాల‌ని నిర్ణ‌యించాడు. ఆతిథ్య జ‌ట్టు ఇంగ్లండ్‌ను ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. లండ‌న్‌లోని ఓవ‌ల్ స్టేడియం వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 

లండ‌న్ టూర్‌లో ఐదో టెస్టు మ్యాచ్‌లో బోల్తా ప‌డిన టీమిండియా టీ20 సిరీస్‌ను మాత్రం చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. టీ20 సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల‌ను నెగ్గిన టీమిండియా అనూహ్యంగా మూడో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. తాజాగా 3 మ్యాచ్‌లతో కూడిన వ‌న్డే సిరీస్‌ను అయినా చేజిక్కించుకోవాల‌న్న క‌సితో ఉన్న ఇంగ్లండ్ జ‌ట్టును ఎలాగైనా క‌ట్ట‌డి చేయాల్సిందేన‌న్న దిశ‌గా టీమిండియా బ‌రిలోకి దిగుతోంది.

More Telugu News