Kamal Haasan: రూ. 300 కోట్లు సంపాదిస్తానని చెపితే ఎవరూ నమ్మలేదు: కమలహాసన్

  • ఘన విజయం సాధించిన కమల్ చిత్రం 'విక్రమ్'
  • తన అప్పులన్నింటినీ తీర్చేస్తానన్న కమల్
  • సన్నిహితులకు చేతనైనంత సాయం చేస్తానని వ్యాఖ్య
Ill clear all debts with this money says Kamal Haasan

విలక్షణ నటుడు కమలహాసన్ తాజా చిత్రం 'విక్రమ్' ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 300 కోట్లను వసూలు చేసి సత్తా చాటింది. దాదాపు నాలుగేళ్ల పాటు కమల్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన తన సినిమా ఈ రేంజ్ లో దూసుకుపోతుండటంపై కమల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రూ. 300 కోట్లు సంపాదిస్తానని గతంలో తాను చెపితే ఎవరూ నమ్మలేదని, కనీసం తన మాటలను అర్థం కూడా చేసుకోలేదని కమల్ చెప్పారు. 'విక్రమ్' సినిమా వసూళ్లతో ఇప్పుడు తన మాట నిజమైందని అన్నారు. 

ఈ సినిమాతో వచ్చిన డబ్బులతో తన అప్పులన్నింటినీ తీర్చేస్తానని చెప్పారు. తనకు ఇష్టమైన ఆహారాన్ని తింటానని అన్నారు. కుటుంబానికి, సన్నిహితులకు చేతనైనంత సాయం చేస్తానని చెప్పారు. డబ్బులు అయిపోయాక ఇవ్వడానికి తన వద్ద ఏమీ లేదని చెపుతానని అన్నారు. ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుని పక్కవాళ్లకు సాయం చేయాలనే ఉద్దేశం మాత్రం తనకు లేదని చెప్పారు.

More Telugu News