Vijay: మహేశ్ నో చెప్పిందీ అందుకే .. విజయ్ ఎస్ చెప్పిందీ అందుకేనట!

  • షూటింగు దశలో వంశీ పైడిపల్లి మూవీ 
  • విజయ్ కి కెరియర్ పరంగా ఇది 66వ సినిమా
  • ఆయనతో ద్విపాత్రాభినయం చేయిస్తున్న వంశీ పైడిపల్లి
  • ముందుగా ఇది మహేశ్ కి చెప్పిన కథ అంటూ టాక్
Vijay and Vamsi  Paidipalli Movie  Update

తమిళనాట విజయ్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'బీస్ట్' ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తరువాత సినిమాను ఆయన వంశీ  పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ప్రస్తుతం షూటింగు జరుపుకుంటోంది.

ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనేది  తాజా సమాచారం. ఈ కథను వంశీ పైడిపల్లి ముందుగా మహేశ్ బాబుకి వినిపించాడు. ద్విపాత్రాభినయాలు చేయదలచుకోలేదని ఒక సందర్భంలో మహేశ్ చెప్పాడు. అందువలన ఈ కథను ఆయన సున్నితంగా తిరస్కరించాడు. దాంతో ఆ కథను విజయ్ కి వినిపించాడు వంశీ పైడిపల్లి. 

ద్విపాత్రాభినయం పట్ల గల ఆసక్తితోనే విజయ్ ఈ సినిమా చేయడానికి వెంటనే అంగీకరించాడట. రెండు పాత్రల మధ్య వేరియేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఒక కథానాయికగా అయితే రష్మికను తీసుకున్నారు. మరో కథానాయికకి ఛాన్స్ ఉంటుందా లేదా అనేది మాత్రం తెలియదు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.

More Telugu News