Chandrababu: హోటల్ లో ఫర్నిచర్ ధ్వంసం చేసి మహిళలను బెదిరించారు: చంద్రబాబు

  • కుప్పంలోని ఓ దాబా నిర్వాహకులపై దాడి
  • కుప్పంలో దాడుల సంస్కృతి తెచ్చారంటూ చంద్రబాబు ఆగ్రహం
  • దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
YSRCP people attacked women in Kuppam says Chandrababu

ప్రశాంతంగా ఉండే కుప్పంలో దాడుల సంస్కృతిని వైసీపీ తీసుకురావడం దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంలోని ఓ హోటల్ (దాబా) పై వైసీపీ కౌన్సిలర్లు చేసిన దాడిని ఆయన ఖండించారు. హోటల్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేసి మహిళలను బెదిరించారని మండిపడ్డారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. 

కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఒక కౌన్సిలర్, మరో కౌన్సిలర్ కుమారుడు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని హోటల్ నిర్వాహకులు తెలిపారు. కుప్పం బైపాస్ రోడ్డులో ఈ దాబా ఉంది. దాబాలో వైసీపీ నేతలు చేసిన దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో వచ్చాయి.

More Telugu News