AP High Court: టీడీపీ నేత చింత‌మ‌నేనికి హైకోర్టులో ఊర‌ట‌

  • బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో చింత‌మ‌నేని వ్యాఖ్య‌ల‌పై ఫిర్యాదు
  • చింత‌ల‌పూడి పోలీస్ స్టేష‌న్‌లో చింత‌మ‌నేనిపై అట్రాసిటీ కేసు
  • కేసును స‌వాల్ చేస్తూ హైకోర్టును ఆశ్ర‌యించిన మాజీ ఎమ్మెల్యే
  • త‌దుప‌రి చ‌ర్య‌లు వ‌ద్దంటూ స్టే విధించిన హైకోర్టు
big releif to tdp leader chintamaneni prabhakar

టీడీపీ సీనియ‌ర్ నేత‌, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు బుధ‌వారం హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. చింత‌మ‌నేనిపై న‌మోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దంటూ హైకోర్టు స్టే విధించింది. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీల‌కు నిర‌స‌న‌గా టీడీపీ 'బాదుడే బాదుడు' పేరిట నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. 

ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా గ‌త వారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా చింత‌మ‌నేని ఘాటు వ్యాఖ్య‌లు చేశారంటూ చింత‌ల‌పూడి పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా చింత‌మ‌నేనిపై చింత‌ల‌పూడి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు. ఈ కేసును స‌వాల్ చేస్తూ చింత‌మనేని హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై బుధవారం నాడు విచార‌ణ చేప‌ట్టిన కోర్టు... ఈ కేసులో త‌దుప‌రి చర్య‌లు చేప‌ట్ట‌వద్దంటూ స్టే విధించింది.

More Telugu News